Monday 17 October 2016

అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్,ఫేస్ మాస్క్స్


అందం, దీనికోసం అందరూ ఏమిచేయడానికైన సిద్దపడతారు,దీన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు, అయితే అందమైన చర్మం కోసం చందనం చెప్పే మరింత అందమైన చిట్కాలు చుసేద్దామ. చందనం, గులాబీలు, ఈ రెండిటి కలియక అనేక సత్ఫలితాలను ఇస్తుంది, ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించుకుంటే మీ చర్మం ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా కనిపించడమే కాకుండా, మీ ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి, మీ ముఖం మృదువుగా మారి ,ఎంతో కాతివంతంగా మెరుస్తుంది.
అందమైన చర్మానికి చందనం ఇలా అంటుంది..

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 1:
చందనం మన చర్మానికి ఎంతో మంచిది, ఇది మన చర్మంలోని నల్ల మచ్చలు, మొటిమములు,ముడతలు, ఇలా అన్నింటినీ తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.అయితే దీనిని జిడ్డు మరియు పొడి చర్మం కోసం ఉపయోగించుకోవచ్చు,
జిడ్డు గల చర్మం అయితే కొన్ని క్రీము పదార్థాలతో కలిపి ఉపయోగించండి,పొడి చర్మం అయితే పన్నీరుతో కలిపి ఉపయొగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు చందనం పొడి
పన్నీరు
తయారుచేసుకునే పద్దతి:
2 టేబుల్ స్పూన్లు చందనం పొడి, కొంచెం పన్నీరు తీసుకుని పేస్ట్ లా చేయండి.మీ ముఖాన్ని శుబ్రంగా చల్లని నీటితో శుబ్రం చేసుకుని,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి,
20 నిమిషాల తరువాత మెల్లగా చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి సత్ఫలితాలు పొందుతారు.
ఈ పన్నీరులోని సువాసన పరిమళం మీ మనసుని,మెదడుని ప్రశాంతంగా ఉంచి మీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
ఈ పన్నీరు వల్ల మన చర్మంలోని మలినాలు అన్నీ పొయి, మీ చర్మంలోని చర్మ కణాలు తెరుచుకుని, మీ చర్మం ఎంతో అందంగా, కాంతివంతంగా మారుతుంది.
అధిక వేడివల్ల మీ ముఖం పై వచ్చే ఎర్రని కందిన మచ్చలను దూరం చేసి మంచి మచ్చ రహితమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.



చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 2:
కావలసినవి:
రోజ్ రేకుల
నూరిన వోట్స్
తాయారుచేసుకునే విధానం:
2 రోజా పూల రేకులు తీసుకుని, 2 టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్ తీసుకుని,కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేసి 5 నిమిషాల్లో మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది.
మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుబ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే, మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 3:
ఈ ఫేస్ ప్యాక్ మన చర్మంలోని మొటిమలను, మచ్చలను తొలగించి యవ్వనమైన చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది, అయితే ఈ మిశ్రమంలో పసుపుని కూడా కలిపితే మీ చర్మంలో ఉన్న క్రిములని నాశనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కావలసినవి:
1 టేబుల్ స్పూన్ పసుపు
2 టేబుల్ స్పూన్ లు గంధం పొడి
3 టేబుల్ స్పూన్ లు తేనె
తాయారుచేసుకునే విధానం:
పైన సూచించిన వన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి.మంచి సువాసనతో పరిమళించే ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, మీ శరీరం అంతా పట్టించుకోవచ్చు, 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

0 comments:

Post a Comment