Monday 7 November 2016

గమ్మతైన విషయం ఏంటంతే కోడి పందాలు వేసే పందెం కోళ్ళకు సైతం ఇవే ఎక్కువ పెడతారు!

మన పూర్వికులు రాగులను బాగా వాడేవారు. ఆరోగ్యానికి కొండంత బాసటగా ఇవి నిలుస్తాయనేది వారి అనుభవం చెబుతోంది. అందుకే కొందరు ఇప్పటికీ రాగి జావను త్రాగుతుంటారు. ఇంకో గమ్మతైన విషయం ఏంటంతే కోడి పందాలు వేసే పందెం కోళ్ళకు సైతం ఇవే ఎక్కువ పెడతారు. ఎందుకంతే వీటి వల్ల వచ్చే బలం చాలా ఎక్కువ. రాయలసీమలో ఈనాటికీ రాగి సంగటి ఆహరంగా వాడటం జరుగుతోంది. కానీ రాగులు చేసే ఉపయోగాలు, ఇచ్చే ఆరోగ్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ వాడతారు. అవేంటో ఇప్పుడు చూద్దామా?

1. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.



2. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.

3.కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతాయి.

4.ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.

0 comments:

Post a Comment